విరాటపర్వం.. దర్శకుల కోసం స్పెషల్ షో.. ఎప్పుడంటే ?

వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా నటించిన చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమా ఆసక్తిని పెంచిది. ఈ ట్రైలర్ ను సుకుమార్, క్రిష్ తదితరులు వేణు ఉడుగులకి ఫోన్ చేసి మరీ అభినందిచారట. అంతేకాదు.. సినిమా ఎప్పుడు చూపిస్తున్నావు అని అడుగుతున్నారట. సినిమా బాగుంటే తమ వంతు మాట సాయం చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో  హైదరాబాద్ లో ఒక ప్రత్యేకమైన షో వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఈ నెల 17న విరాటపర్వం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపే స్పెషల్ షో వేయనున్నారు. బహుశా.. ఈ ఆదివారం ఉండే అవకాశం ఉంది. ఇక విరాటపర్వం ట్రైలర్ ను చూసి కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సైతం ట్వీట్ చేస్తున్నారు. దీంతో సినిమాపై ఇంకా హైప్ పెరుగుతుంది. 1990ల్లో తెలంగాణలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా, నక్సల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో రానా హీరోనే అయినప్పటికీ, సినిమా మొత్తం సాయిపల్లవి పాత్ర చుట్టూ తిరుగుతుంది.