ఐపీఎల్ ఆదాయం రూ.48,390 కోట్లు

ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన లీగ్‌గా ఐపీఎల్ ఎదిగింది. మీడియా హక్కుల అమ్మకం ద్వారా భారీ ఆదాయం పెరిగింది. రాబోయే అయిదేళ్ల కాలానికి (2023 నుంచి 2027) మీడియా ప్రసార హక్కుల వేలం మంగళవారం ముగిసింది. ఈ హక్కులను అమ్మడం ద్వారా బీసీసీఐ రూ.48,390 కోట్లు ఆర్జించింది. 
ఉపఖండపు టీవీ ప్రసార హక్కులను డిస్నీ స్టార్‌ రూ.23,575 కోట్లకు (మ్యాచ్‌కు రూ.57.5 కోట్లు) సొంతం చేసుకోగా.. తీవ్ర పోటీ మధ్య ఇండియా డిజిటిల్‌ హక్కులను రిలయన్స్‌ భాగస్వామిగా ఉన్న వయాకామ్‌18 రూ.20,500 కోట్లకు చేజిక్కించుకుంది. నాన్‌-ఎక్స్‌క్లూజివ్‌ ప్యాకేజీ ‘సి’ని (డిజిటట్‌, కొన్ని మ్యాచ్‌లు, భారత్) కూడా వయాకామ్‌ 18 రూ.3257.5 కోట్లకు సొంతం చేసుకుంది. ప్యాకేజీ డిని (రెస్టాఫ్‌ వరల్డ్‌, టీవీ+ డిజిటల్) రూ.1058 కోట్లకు వయాకామ్ 18, టైమ్స్‌ ఇంటర్నెట్ దక్కించుకుంది.

దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. మన దేశంలో క్రికెట్ ఒక మతం. గత 50 ఏళ్లలో ఆటకు ఆదరణ తీసుకువచ్చిన ఆటగాళ్లకు, నిర్వాహకులకు అభినందనలు. అలాగే క్రికెట్‌కు అంతగా ఆదరణ లేనప్పుడు పెద్ద సంఖ్యలో స్టేడియాలకు వెళ్లి, టీవీల ముందు కూర్చుని మ్యాచ్‌లు వీక్షించిన అభిమానులకు, మద్దతుదారులకు నా ప్రత్యేక శుభాకాంక్షలు’ తెలిపారు గంగూలీ.