అమితాబ్ తో ఆర్జీవీ మరో సినిమా

బిగ్ బి అమితాబ్, ఆర్జీవీ కాంబినేషన్ లో గతంలో సర్కార్, సర్కార్ రాజ్, సర్కార్-3, ఆగ్, నిశ్శబ్ద్ లాంటి సినిమాలొచ్చాయి. వీటిలో ‘సర్కార్’ సినిమా సంచలన విజయం సాధించగా.. నిశ్శబ్ద్ సినిమా కేవలం సంచలనాలు మాత్రం సృష్టించింది. ఇప్పుడు వీరి కాంబోలో మరో సినిమా రాబోతుంది.

‘కొండా’ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న వర్మ.. అమితాబ్ తో మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు.ఈసారి అమితాబ్ కోసం తనకు ఎంతో ఇష్టమైన హారర్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు వర్మ. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెడతానని స్పష్టం చేశాడు. ఇక కొండా సినిమా విషయానికొస్తే.. వరంగల్ రాజకీయాల్లో చక్రం తిప్పిన మురళి-సురేఖ దంపతుల జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల 23న ‘కొండా’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.