ధనుష్ ‘తిరుచిత్రంబలం’ రిలీజ్ ఎప్పుడంటే ?

  మారన్ తర్వాత కోలీవుడ్ స్టార్ ధనుష్ చేస్తున్న సినిమా ‘తిరుచిత్రంబలం’. మిత్రన్ కె జవహర్ దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు నిత్యా మీనన్, రాశి ఖన్నా, ప్రియా భవాని శంకర్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేశారు మేకర్స్. ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మోషన్ పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఇందులో ధనుష్ స్టైలీష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.  భారతీరాజా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.