నయన్-విక్కీ.. థాయ్ లాండ్ లో హనీమూన్ !

ఈ నెల 9న పెళ్లిబంధంతో ఒక్కటైంది ప్రేమ జంట నయనతార-విఘ్నేష్ శివన్. పెళ్లి పనులు అన్ని పూర్తి కావడంతో ఈ జంట హనీమూన్ కి బయలు దేరింది. ఫ్లైట్ ఎక్కేసి థాయ్ లాండ్ లో వాలిపోయింది. ఎయిర్ పోర్ట్ లో ఈ జంట నవ్వుతూ కెమెరాకు పోజులు ఇచ్చింది. ఇక వెకేషన్  నుంచి తొలి ఫోటో ఒకటి నయన్ షేర్ చేసింది. 


2015 నుంచి ఈ జంట ప్రేమలో ఉంది. దాదాపు ఏడేళ్ల ప్రేమ తర్వాత పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అంతకుముందు ప్రభుదేవా, శింబులతో నయన్ డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుదేవాతో నయన్ వ్యవహారం పెళ్లి దాక వెళ్లింది. ఆఖరి నిమిషంలో ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న నయన్.. విగ్నేష్ తో ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్య కూడా విబేధాలు వచ్చాయని చాలా సార్లు ప్రచారం జరిగింది. అయితే అవన్నీ దాటుకొని ఈ జంట పెళ్లి చేసుకుంది.