విలన్ రొమాన్స్

జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, దిశా పటానీ, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘ఏక్ విలన్ రిటర్న్స్’. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. జులై 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా జులై 29కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్ర యూనిట్. రేపే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అప్ డేట్ ఇస్తూ.. రొమాంటిక్ పోస్టర్లు వదిలారు. 

ఇందులో దిశా పటానీతో జాన్ అబ్రహం, తారా సుతారియా తో అర్జున్ కపూర్ రొమాన్స్ లో మునిగిపోయారు.  2014లో వచ్చిన ‘ఏక్ విలన్ కు సీక్వెల్ గా తెరకెక్కింది. అయితే సీక్వెల్ లో కథ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.  ఈ యాక్షన్ థ్రిల్లర్ ను టీ-సిరీస్, బాలాజీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.