విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన సింగర్స్‌ జోడీ

సింగర్స్‌ జోడీ హేమచంద్ర, శ్రావణ భార్గవి సంసార జీవితంలో కలతలు మొదలయినవి. కొద్దిరోజులుగా వీరు విడి విడిగానే ఉంటున్నారు. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి ఇద్దరూ ఖండించ పోవడంతో.. అందరూ నిజమే అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ స్టా వేదికగా విడాకులపై సింగర్ జోడి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

“నా సోలో పాటల కంటే ఇలాంటి అనవసర, అప్రస్తుత, పనికిరాని సమాచారం ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది” అని హేమచంద్ర పోస్ట్‌ పెట్టారు. “గడిచిన కొన్ని రోజుల నుంచి నా యూట్యూబ్‌ ఛానల్‌ వ్యూస్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ విపరీతంగా పెరిగిపోయారు. సాధారణం కంటే ఇప్పుడు ఎక్కువ వర్క్‌, సంపాదన లభిస్తోంది. తప్పో ఒప్పో కానీ మీడియా నాకో వరం” అని శ్రావణ భార్గవి రాసుకొచ్చారు. మొదటి నుంచి స్నేహితులైన వీరిద్దరూ 2009లో పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప ఉంది.