‘విక్రమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

థియేటర్స్ లో రిలీజైన సినిమాలు నెల గ్యాప్ లోనే ఓటీటీ బాట పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తాజా చిత్రం ‘విక్రమ్’. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జూన్ 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. 

విక్రమ్ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన విక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 

ఈ చిత్రానికి లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు.  ఆర్.మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చాన్నాళ్ల తర్వాత కమల్ కమర్షియల్ హిట్ కొట్టారు. మరోసారి తన నట విశ్వరూపం చూపించారు.