వైరల్ : హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో అమితాబ్‌

బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ గత కొన్నిరోజుల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అమితాబ్‌ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం వర్క్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి నాగ్‌అశ్విన్‌ దర్శకుడు. వైజయంతి మూవీస్‌ పతాకంపై ఈ సినిమా సిద్ధమవుతోంది. దీపికా పదుకొణె కథానాయిక.

గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్‌ హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇక మంగళవారం సాయంత్రం బిగ్ బీ అమితాబ్ రాయదుర్గం మెట్రోస్టేషన్‌లో సందడి చేశారు. ట్రైన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ కోసం స్టేషన్‌కు వెళ్లిన ఆయన్ను చూసేందుకు పలువురు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.