20 వేలు దాటిన కొత్త కేసులు

దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 20,139 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 5.10 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకూ 4.36 కోట్ల మంది మహమ్మరి బారినపడ్డారని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం వైరస్ వ్యాప్తితో క్రియాశీల కేసులు 1.36 లక్షలకు చేరాయి. మొత్తం కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 0.31 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.49 శాతానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో 16,482 మంది కోలుకొన్నారు. 38 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 5.25 లక్షలు దాటింది.