ప్రకాష్ రాజ్ డైరెక్షన్ లో మరో సినిమా

ప్రకాష్ రాజ్ మంచి నటుడు. ఆయనలో అభిరుచి గల దర్శకుడు కూడా ఉన్నారు. ఆయన డైరెక్షన్ లో ‘ధోనీ’, ‘ఉల‌వ‌చారు బిరియానీ’, ‘మ‌న ఊరి రామాయ‌ణం’ లాంటి సినిమాలొచ్చాయి. అయితే ఇవన్నీ మంచి సినిమాలు అనిపించుకున్నాయి. కానీ కమర్షియల్ గా ఆడలేదు. దీంతో దర్శకత్వం జోలికి వెళ్లకుండా.. నటుడిగా బిజీ అయిపోయారు ప్రకాష్ రాజ్. అయితే ఇప్పుడు ఆయన మరోసారి మెగాఫోన్ పట్టుకోబోతున్నారు. ‘మ‌న‌లో ఒక‌డు’ అనే పేరుతో ప్ర‌కాష్‌రాజ్ త్వ‌ర‌లోనే ఓ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌బోతున్నారు. ఓ మ‌రాఠీ నాట‌కం ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయ‌నే.