లైగర్ ట్రైలర్.. రెండు ఈవెంట్లు

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈసారి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ గర్జించబోతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా  ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్రబృందం.. ఎల్లుండి ట్రైలర్ ను లాంచ్ చేయనుంది.

ఒకే రోజు రెండు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు ప్లాన్ చేసింది చిత్రబృందం. హైదరాబాద్, ముంబైలోనూ ఈవెంట్స్ నిర్వహించబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. హైదరాబాద్ లోని ఆర్టీసి క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ఉదయం 9:30 గంటలకు తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. అలాగే జూలై 21, 2022న ముంబైలోని అంధేరిలోని సినీపోలిస్‌లో రాత్రి 7:30 గంటలకు ముంబై ఈవెంట్ జరగనుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.  పూరి, ఛార్మిలతో కలిసి కరణ్ జోహార్  ఈ సినిమాని నిర్మించారు.