చిల్లర్ ఆన్ యాక్షన్

మిస్ వరల్డ్ కిరీటం తెచ్చిపెట్టిన ఆరో భారత అందం మానుషి చిల్లర్. 2017లో మిస్ వరల్డ్ విజేతగా నిలిచింది. అంతకుముందు రీటా ఫారియా (1996), ఐశ్వర్యా రాయ్ (1194), డయానా హేడెన్ (1197), యుక్తా ముఖే (1999), ప్రియాంక చోప్రా (2000) ఈ టైటిల్ ను గెలుచుకున్నారు. ఇక ‘పృధ్వీరాజ్’ సినిమాతో మానుషి చిల్లర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదో హిస్టారికల్ యాక్షన్ డ్రామా. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. మానుషి నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇక చిల్లర్ నటిస్తున్న మరో సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. రిలీజ్ కి రెడీగా ఉంది. తాజాగా చిల్లర్ మూడో సినిమా అప్ డేట్ వచ్చింది. అరుణ్ గోపాలన్ దర్శకత్వంలో జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ TEHRAN. ఈ సినిమాలో మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా సెట్స్ నుంచి రెండు పిక్స్  బయటికొచ్చాయి. ఇందులో చిల్లర్ చేతిలో గన్ పట్టుకొని యాక్షన్ లోకి దిగింది. బేబీ కటింగ్ తో కొత్త లుక్ లో దర్శనమిచ్చింది.