తండ్రి పాత్రలో చైతూ

పరశురామ్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కథపై ఇంట్రస్టింగ్ అప్ డేట్  తెలిసింది. ఈ కథలో చైతు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడట. తండ్రి పాత్రలోనూ, అటు కొడుకు పాత్రలోనూ చైతూనే. ఇది ఒక తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అని, అలాగే ట్రెండీ లవ్ స్టొరీ కూడా సినిమాలో ఉంటుందని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ పై తెరకెక్కనుంది. పరశురామ్, చైతూ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం కాబోతున్నారు.

వాస్తవానికి గీత గోవిందం’ తర్వాతే నాగ చైతన్యతో పరశురామ్ సినిమా ఫిక్సయింది. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకునే సమయంలో మహేష్ నుంచి పిలుపొచ్చింది. ‘సర్కారు వారి పాట’ సెట్స్ మీదకు వెళ్ళింది. చైతూ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు చైతూ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో పరశురామ్ ఉన్నారు.