#SSMB28 హీరోయిన్ గా డాక్టర్ బ్యూటీ

 
చెన్నై బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ సూపర్ ఛాన్స్ కొట్టేసింది. త్రివిక్రమ్-మహేష్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా (#SSMB28) రాబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ను తీసుకున్నారు. ఇక సెకండ్ హీరోయిన్ కోసం ప్రియాంక మోహన్ ను ఎంపిక చేసినట్టు తెలిసింది.ఈ సినిమా ‘అతడు’ సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. పార్థు, అర్జునుడు అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం థమన్. హారిక & హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

ఇప్పటి వరకు ప్రియాంక మోహన్ చేసింది ఆరు సినిమాలే. కానీ స్టార్ డమ్ సొంతం చేసుకుంది చెన్నై బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్. శివ కార్తికేయన్ కు జంటగా డాక్టర్, డాన్ సినిమాల్లో నటించింది. ‘ఈటీ’ కోసం సూర్యతో జతకట్టింది. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో మహేష్ తో ఆమెకు రొమాన్స్ సీన్స్ ఉండనున్నాయట. ఇటీవల మహేష్ ని కలిసి తాపీగా కబర్లు చెప్పుకుంటున్న ఓ పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.