ఓటీటీలోకి ‘రాకెట్రీ’ ఎప్పుడంటే ?

మాధవన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్‌’. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. జులై 1న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.40 కోట్లు వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా.

ఇప్పుడీ  ఈ సినిమా ఓటీటీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా జులై 26 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేసింది అమెజాన్ ప్రైమ్. ఇక, ఈ సినిమాతో నటుడిగానే కాకుండా దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేశారు మాధవన్‌. సూర్య, షారుఖ్‌ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు.