వేణు ఉడుగుల.. ఈసారి కమర్షియల్ !

‘నీది నాది ఒకే కథ’తో ప్రతిభగల దర్శకుడు అనిపించుకున్నాడు వేణు ఉడుగుల. రెండో సినిమా ‘విరాట పర్వం’ తో నక్సల్ నేపధ్యంలో ఒక ప్రేమకథని చెప్పాడు. మంచి సినిమా అనిపించుకున్నా.. కమర్షియల్ గా ఆడలేదు. అయితే ఈ సారి వేణు ఉడుగుల కమర్షియల్ గా మారాడు.  ఇప్పుడాయన కొత్త సినిమా జోనర్ ఫిక్స్ అయింది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ని చేయబోతున్నాడు . ప్రస్తుతం కథ ని పూర్తి చేసే పనిలో వున్నాడు. 

ఈసారి పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా చేస్తున్నా. కథ సిద్ధమవుతోంది. హీరోతో పాటు మిగత వివరాలన్నీ త్వరలో బయటికొస్తాయి. హీరో ప్రధానంగా సాగే కథ అది. మంచి కమర్షియల్ విలువలతో తీస్తా. ఆ కథకి నిజ జీవిత సంఘటనల ప్రభావమేవీ లేదు. ఒక కల్పిత కథగా తీస్తున్నానని చెప్పుకొచ్చాడు వేణు. ఎంత నిజాయితీగా సినిమా తీసినా.. ఎన్ని ప్రశంసలు దక్కినా.. అంతిమంగా కమర్షియల్ గా ఆడితేనే సక్సెస్ దక్కుతుంది. మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయి. ఈ నేపథ్యంలోనే వేణు ఉడుగుల అడుగులు కమర్షియల్ వైపు పడినట్టు తెలుస్తోంది.