మీడియాకు కిచ్చా సుదీప్‌ క్షమాపణలు.. ఎందుకంటే ?

ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుధీప్ టాలీవుడ్, కోలీవుడ్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఆయన తాజా చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. సోషియో ఫాంటసీ, యాక్షన్‌ అడ్వెంచర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా జులై 28న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే హైదరాబాద్‌, చెన్నై, కొచ్చిన్‌లలో గురువారం ప్రెస్‌మీట్స్‌ నిర్వహించాలని చిత్రబృందం భావించింది. ఇంతలో సుదీప్‌ అనారోగ్యానికి గురి కావడంతో అవనీ రద్దయ్యాయి. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ , చెన్నై మీడియాకు సుధీప్ సారీ చెప్పారు. 


“అనారోగ్యానికి గురైన కారణంగా ప్రయాణాలు చేయలేకపోతున్నా. దీనివల్ల హైదరాబాద్‌, చెన్నై, కొచ్చిన్‌లో ఈరోజు జరగాల్సిన ప్రెస్‌మీట్స్‌ అన్నింటినీ రద్దు చేస్తున్నా. మీడియా మిత్రులందరికీ క్షమాపణలు చెబుతున్నా. కోలుకొన్న వెంటనే ప్రెస్‌మీట్స్‌లో మళ్లీ పాల్గొంటా. త్వరలోనే మీ అందర్నీ కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నా”నని రాసుకొచ్చారు సుధీప్. ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు సుధీప్. ఆయన విలనీజం చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

Apologies to all my media frnzz frm Chennai,Kochi & Hydarabad, for having canceled the press meet & event. I have Been Unwell. Feeling much better & shall resume travel again. IHoping to Reschedule to a sooner date.
Looking forward to meeting u all.
🥂
Love & Regards,
Kichcha❤️— Kichcha Sudeepa (@KicchaSudeep) July 21, 2022