బుల్లెట్ దిగిందా.. ? లేదా.. ??

ఇన్నాళ్లు లైగర్ అప్ డేట్స్ రావడం లేదని అడిగారు.. ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా ? లేదా ?? అంటూ పోకిరి డైలాగ్ డైలాగ్ కొట్టారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. హైదరాబాద్ సుదర్శన థియేటర్ లో ఈ ఉదయం లైగర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా విజయ్, అనన్య పాండే ఊరిగెంపుగా వచ్చారు. వారికి అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఇక ట్రైలర్ రిలీజ్ సందర్భంగా.. విజయ్ మాట్లాడుతూ.. ఆగస్టు 25న ఇండియా షేక్ అవుతుంది అన్నారు.

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో విజయ్ దేవరకొండ ఇండియాలో గ్రేట్ థింగ్ అవుతాడని చెప్పుకొచ్చారు. అయితే విజయ్, పూరి మాట్లాడుతున్న సమయంలో అభిమానులు కేకలు, ఈలలతో రెచ్చిపోవడంతో.. వారి స్పీచ్ కూడా సరిగ్గా వినబడని పరిస్థితి. హీరోయిన్ అనన్య పాండే రౌడీ హీరో ఫాలోయింగ్ ను చూసి.. పరేషాన్ అయినట్టు కనిపించింది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. పూరి మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్. దానికి రౌడీ యాక్షన్ తోడైంది. నిజంగా లైగర్ తో పూరి-రౌడీ ఇండియాను షేక్ చేయబోతున్నట్టు కనిపిస్తోంది. 

@TheDeverakonda the next big thing in country 💥
He is the next big thing in Indian Cinema 🤗

-The Man himself who made Super stars like MB,PK,PB in TFI #LigerTrailer #VijayDeverakonda @PuriConnects #LigerTrailerHAVOC #LIGER pic.twitter.com/7YIYis3bQO— VB (@Mr_ViolentBoy) July 21, 2022