విండీస్ తో తొలి వన్డే.. జడేజా కష్టమే !

వెస్టిండీస్‌ తో మూడు వన్డేల సిరీస్ నేడు ప్రారంభం కానుంది. ఇవాళ రాత్రి తొలి వన్డే జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో అల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆడే అవకాశాలు తక్కువగా కన్పిస్తున్నాయి. గాయంతో ఇబ్బంది పడుతున్న జడేజా తొలి వన్డేలో ఆడటం కష్టమేనని కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ చెప్పారు. మ్యాచ్‌కు ముందు ధావన్‌ మీడియాతో మాట్లాడారు.

ఫాస్ట్‌ బౌలింగ్‌లో సిరాజ్‌, ప్రసిధ్‌తో పాటు స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, యుజువేంద్ర చాహల్‌లతో మా బౌలింగ్‌ యూనిట్‌ పటిష్ఠంగా ఉందిని ధావన్ చెప్పుకొచ్చాడు. అయితే ధావన్ తో పాటు ఓపెనింగ్ దిగే బ్యాట్స్ మెన్ ఎవరు ? అన్నది క్లారిటీ రావాల్సింది. ఇషాన్ కిషన్, శుభమన్ గిల్ లో ఒకరు ధావన్ తో కలిసి ఓపెనింగ్ కి రావొచ్చు. అయితే లెఫ్ట్-రైట్ కాంబినేషన్ నేపథ్యంలో గిల్ కి అవకాశం రావొచ్చు.