చైతూతో బ్రేకప్.. అసలు కారణాలు బయటపెట్టిన సమంత !

దాదాపు పదేళ్ల పాటు ప్రేమలో ఉండి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య – సమంత.. నాలుగేళ్ల సంసార జీవితం తర్వాత విడిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే దీని వెనుక గల అసలు కారణాలు ఏంటీ ? అన్నది బయటికి తెలియదు. అయితే సమంత మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో పెదవి విప్పారు. ‘కాఫీ విత్‌ కరణ్‌’  షోలో పాల్గొన్న ఆమె పలు షాకింగ్‌ విషయాలు చెప్పారు.

తాము విడిపోవడం అంత సులభంగా జరగలేదన్నారు. తమ మధ్య సఖ్యత లేదని.. ఒకవేళ తమని ఓ గదిలో ఉంచితే అక్కడ పదునైన ఆయుధాలు లేకుండా చూడాలని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నీ భర్త అంటూ కరణ్ సంబోధించడం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మాజీ భర్త అనాలని ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఇక విడాకుల సమయంలో రూ. 250కోట్ల భరణం తీసుకున్నది అనే ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది. అందులో నిజం లేదు. అవన్నీ పుకార్లే అని చెప్పుకొచ్చింది. ఈ పురుషాధిక్య సమాజంలో వారిలోని లోపాలు ఎత్తిచూపించడానికే..  ‘ఊ అంటావా’ సాంగ్‌ చేశానని చెప్పింది.