48గంటలు.. 82 మిలియన్ వ్యూస్

పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్. ఈ యాక్షన్  ప్యాక్డ్ ట్రైలర్ దూసుకుపోతుంది. 48 గంటల్లో 82 మిలియన్ పైగా వ్యూస్ సొంతం చేసుకొంది. యూట్యూబ్ ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతోంది.

హిందీ ట్రైల‌ర్‌కు 34 మిలియ‌న్ల వ్యూస్ రాగా తెలుగు ట్రైల‌ర్ 18 మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను రాబ‌ట్టింది. 2022లో త‌క్కువ టైమ్‌లోనే అత్య‌ధిక వ్యూస్‌ను రాబ‌ట్టిన ట్రైల‌ర్‌ల‌లో ఒక‌టిగా లైగర్ నిలిచింది. తెలుగు ట్రైల‌ర్ కంటే హిందీ ట్రైల‌ర్‌కు అత్య‌ధిక వ్యూస్ రావ‌డం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్ గా మారింది. హిందీలో విజ‌య్ దేవరకొండకు ఉన్న క్రేజ్ కు ఈ ట్రైలర్ నిద‌ర్శ‌న‌మిద‌ని అత‌డి అభిమానులు చెబుతున్నారు.

శుక్రవారం హైదరాబాద్, ముంబైలో నిర్వహించిన ట్రైలర్ ఈవెంట్లు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. హిందీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రణ్ వీర్ సింగ్ సందడి చేశారు. రౌడీ సింపుల్ సిటీకి ఫిదా అయ్యాడు. లైగర్ తో ఇండియాను షేక్ చేయబోతున్నామని విజయ్ మరోసారి స్పష్టం చేశారు.