సిరాజ్‌, సంజూ.. సూపర్ !

వెస్టిండీస్ తో టీమిండియా తొలి వన్డే పోరు ఉత్కంఠగా సాగింది. 3 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌   (97; 99 బంతుల్లో 10×4, 3×6) , శుభ్‌మన్‌ గిల్‌   (64; 53 బంతుల్లో 6×4, 2×6), శ్రేయస్‌ అయ్యర్‌   (54; 57 బంతుల్లో 5×4, 2×6) రాణించారు. 

అనంతరం 309 విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ గెలిచినంత పని చేసింది. ఆఖరి ఓవర్ లో ఆ జట్టుకు 15 పరుగులు కావాలి. అయితే సిరాజ్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో 3 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. సిరాజ్ తో పాటు సంజూ శాంసన్ అద్భుతమైన కీపింగ్ టీమిండియా గెలుపులో కీలక పాత్ర వహించిందని చెప్పవచ్చు.