సమంత-చైతూ.. చంపుకునేంత శ‌త్రుత్వం ?

సమంత-చైతూ అన్యోన్యంగానే ఉన్నట్లు అనిపించేది. వారిద్దరి విడిపోవడం అందరినీ షాక్ గురిచేసింది. వీరిద్దరు విడిపోవడంపై సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆశ్చర్యం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ? మురళీ మోహన్ అపార్ట్ మెంట్ లో ఓ ఫ్లాట్ లో సామ్-చైతూ కాపురం పెట్టారు. వీరిద్దరు ఎప్పుడూ గొడవ పడినట్టు బయటికి కనిపించలేదట. దీంతో చిన్న చిన్న ఇగోలతో విడిపోయి ఉంటారని అందరు అనుకున్నారు. కానీ ఓ రేంజ్ లో శత్రుత్వం ఉందని సమంత మాటలను బట్టీ అర్థమవుతోంది. 

కాఫీ విత్ కరణ్ సీజన్ -1లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి పాల్గొన్న సమంత.. తొలిసారి చైతూతో విడాకులపై స్పందించింది. “మా ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం లేదు. ఒక‌వేళ మా ఇద్ద‌రిని ఒకే గ‌దిలో ఉంచితే అక్క‌డ ఎలాంటి ప‌దునైన ఆయుధాలు, వ‌స్తువులు లేకుండా చూసుకోవాలి” అని సంచ‌ల‌న కామెంట్స్ చేశారామె. ఈ మాట‌లు స‌ర‌దాగా అన్న‌వి కాద‌నే విష‌యాన్ని గ్ర‌హించాలి. ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌నే వ‌ర‌కూ ఓకే. కానీ ఇద్ద‌ర్నీ ఒకే గ‌దిలో ఉంచితే, అక్క‌డ ఎలాంటి ప‌దునైనవి లేకుండా చూసుకోవాల‌ని చెప్ప‌డం ద్వారా… వాటితో చంపుకునే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని ఆమె బ‌హిరంగంగానే చెప్పారు. స‌మంత వ్యాఖ్య‌ల్లోని తీవ్ర‌త‌ను గ‌మ‌నిస్తే… ప‌ర‌స్ప‌రం చంపుకోడానికి కూడా వెనుకాడ‌నంత‌గా ఇద్ద‌రి మ‌ధ్య శ‌త్రుత్వం ఉంద‌నే క‌ఠిన వాస్త‌వాన్ని ఆమె బ‌య‌ట‌పెట్టారు