కేసీఆర్‌పై పోటీకి సై

ముఖ్యమంత్రి కేసీఆరే తన టార్గెట్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పోటీగా బరిలోకి దిగుతా. ఇప్పటికే గజ్వెల్ లో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశానని ఇటీవల బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి కేసీఆర్ పై పోటీపై స్పందించారు. అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తానన్నారు.


‘పల్లె గోస-భాజపా భరోసా’ కార్యక్రమంలో భాగంగా ఆయన దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సోమవారం సీసీ కుంట మండలం అప్పంపల్లికి చేరుకున్న ఆయన  అక్కడ తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా విశ్వాసం కోల్పోయారన్నారు. ఎమ్మెల్యేలు ఏ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ చేరినా ఆహ్వానిస్తామని స్పష్టంచేశారు. హుజూరాబాద్‌ ప్రజలు ఇచ్చిన తీర్పే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో రిపీటవుతుందన్నారు.