అలర్ట్ : #RC15 పేరిట మోసాలు

గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా (#RC15) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్. అంజలి, సునీల్.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా పేరు చెప్పుకొని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారనే వార్తలు దిల్ రాజు దృష్టికి వచ్చాయట. #RC15 కోసం నటీనటులు, టెక్నిషన్స్ కావాలని డబ్బులు గుంజే కార్యక్రమం జరుగుతుందట. ఇవన్నీ వట్టి ఫేక్ వార్తలు అని ఆదివారం దిల్ రాజు బ్యానర్ నుంచి ఓ ప్రెస్ నోట్ విడుదలైంది.

ఇప్పటి వరకు #RC15 కోసం నటీనటులు కావాలని ప్రకటన ఇవ్వలేదు. ఎలాంటి సంస్థను తాము పని అప్పగించలేదని అందులో పేర్కొన్నారు. ఇక #RC15 షూటింగ్ ఇటీవల రాజమండ్రిలో జరిగింది. ఈ సందర్భంగా రామ్ చరణ్, చిత్రబృందానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రామ్ చరణ్ తదుపరి సినిమా విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.