చంపేస్తామంటూ.. విక్కీ, కత్రినాకు బెదిరింపులు

బాలీవుడ్ స్టార్ కపుల్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ లపై ఓ వ్యక్తి పగబట్టారు. విక్కీ, కత్రినాపై తీవ్రంగా దాడి చేసి.. చంపేయాలనుకుంటున్నానని మన్వీందర్‌ సింగ్‌ గత కొంతకాలంగా సోషల్‌మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు.ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసులు ఆ వ్యక్తిపై శాంతాక్రూజ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మన్వీందర్‌ సింగ్‌ కూడా నటుడే. ఈ యువ నటుడి బెదిరింపుల వెనుక కారణాలేంటీ ? అన్నది తెలియాల్సి ఉంది.

నాలుగేళ్ల నుంచి ప్రేమలో ఉన్న విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌ గతేడాదిలో పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఓ ప్రముఖ కోటలో వీరి వివాహ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సల్మాన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘టైగర్‌-3’లో కత్రినా భాగం కాగా.. ‘గోవిందా నామ్‌ మేరా’, ‘ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’, ‘డుంకీ’ చిత్రాలతో విక్కీ బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల కత్రినా బర్త్ డే సెలబ్రెషన్స్ మాల్దీవుల్లో ఘనంగా జరిగాయి. కత్రినా సన్నిహితులు, కుటుంబ సభ్యులతో ఈ టూర్ కి వెళ్లింది.