హ‌య్యెస్ట్ టాక్స్ పేయ‌ర్స్‌.. రజనీ, అక్షయ్ లకు సన్మానం !

త‌మిళంలో అత్య‌ధిక రెమ్యునరేషన్ స్వీక‌రించే హీరోల్లో రజనీకాంత్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఆదివారం హయ్యెస్ట్ టాక్స్ పేయ‌ర్స్ ను త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం పుర‌స్కారాల‌తో స‌త్క‌రించింది. ఇందులో ర‌జ‌నీకాంత్ అత్య‌ధిక ప‌న్ను చెల్లింపుదారుడిగా నిలిచారు. ర‌జ‌నీ త‌ర‌ఫున ఆయ‌న కూతురు ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ఈ అవార్డును అందుకుంది.

మ‌రోవైపు బాలీవుడ్‌లో అత్య‌ధిక ప‌న్నుచెల్లింపుదారుడిగా అక్ష‌య్‌కుమార్ నిలిచారు. ఆయ‌న్ని ప్ర‌శంసిస్తూ ఐటీ శాఖ స‌మ్మాన్ ప‌త్ర‌ను అంద‌జేసింది. ఈ స‌మ్మాన్ ప‌త్ర స‌ర్టిఫికెట్ ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకుగాను అక్ష‌య్‌కుమార్ 110 కోట్ల‌కు వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను స్వీక‌రిస్తున్నారు. ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తుంటారు. సినిమాల‌తో పాటు యాడ్స్ రూపంలో ప్ర‌తి ఏడాది వంద‌ల కోట్ల‌ రూపాయల్ని అక్షయ్ ఆర్జిస్తున్నారు. ప్ర‌స్తుతం రామ్‌సేతు, ర‌క్షాభంద‌న్ తో పాటు ఏడు సినిమాల్లో న‌టిస్తున్నారు.