ఆ బాధ్యత రామారావు’దే

జనాలు థియేటర్లను మరిచిపోతున్న రోజులివి. ఓ వైపు కరోనా దెబ్బలు, మరోవైపు ఓటీటీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో అసలు థియేటర్లకు వస్తారా ? రానా? అని తెలుసుకోవాలని సినీ ప్రముఖులు అనుకుంటున్నారు. అంటే సుందరానికి..వారియర్ సినిమాలను కొలమానంగా తీసుకోవాలి అనుకుంది టాలీవుడ్. ఆ సినిమాలకు జనాలను థియేటర్ కు తీసుకువచ్చే సత్తా వుందని భావించారు. కానీ అవి కంటెంట్ వైజ్ విఫలమయ్యాయి.

ఇవన్నీ కలిస్తే రామారావు ఆన్ డ్యూటీ. పేరుగా ఓ ప్రభుత్వ అధికారి పాత్ర అయినా, కోర్ పాయింట్ అంతా క్రయిమ్..ఇన్వెస్టిగేషన్..యాక్షన్ తో కూడిన ఎమోషన్ టచ్ తో వుంటుంది.
 ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి రామారావు మీద పడింది. ఎందుకంటే రవితేజ పక్కా మాస్ హీరో. బి సి సెంటర్ల లో టికెట్ తెగడానికి ఆస్కారం వున్న హీరో. అందుకే మళ్లీ జనాలను థియేటర్స్ కు రప్పించి.. జనాలు రెడీగా ఉన్నారు. మనమే మంచి సినిమాలు తీసుకురావాలని భరోసా ఇవ్వగలిగే హీరో రవితేజ అని భావిస్తున్నారు. మరీ.. రామారావు ఏం చేస్తాడో చూడాలి.