ఎమర్జెన్సీ : వాజ్ పేయి ఫస్ట్ లుక్

స్వతంత్ర భారతదేశంలో ఓ చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన ఎమర్జెన్సీపై అదే పేరుతో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఓ మూవీ తెరకెక్కిస్తోంది. ఇందులో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనానే నటిస్తోంది. ఇటీవలే ఆమె ఫస్ట్ లుక్ ని రిలీజ్ అయింది. అచ్చూ ఇందిరాగాంధీ లాగా కనిపించిన కంగనా.. ఆమె హావభావాలను కూడా అచ్చుగుద్దినట్లు దించేసింది.

ఆ తర్వాత ఎమర్జెన్సీని వ్యతిరేకించిన స్వాతంత్య్ర  సమరయోధుడు, భారతరత్న లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రలో నటిస్తున్న అనుపమ్‌ ఖేర్‌ లుక్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. తాజాగా మాజీ ప్రధాని అటల్ బిహారి వాయి పేయి పాత్రలో నటిస్తున్న శ్రేయాస్ తల్పాడే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. యంగ్ ఏజ్ లుక్ లో స్లైలింగ్ ఫేస్ తో శ్రేయస్ ఆకట్టుకున్నాడు.

1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించారు. ఆ సమయంలో ప్రజల ప్రాథమిక హక్కులకు ఎలా భంగం కలిగింది అన్నది సినిమాలో ప్రధానంగా ప్రస్తావించబోతున్నట్టు తెలుస్తోంది. మణికర్ణిక తర్వాత మరోసారి కంగనా దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్న చిత్రమిది.

#SHREYASTALPADE AS #AtalBihariVajpayee IN #Emergency#KanganaRanaut #AnupamKher pic.twitter.com/zuRr9djKYh— OTTRelease (@ott_release) July 27, 2022