మానుషి చిల్లర్ సరికొత్త షో

మిస్ వరల్డ్ కిరీటం తెచ్చిపెట్టిన ఆరో భారత అందం మానుషి చిల్లర్. 2017లో మిస్ వరల్డ్ విజేతగా నిలిచింది. ‘పృథ్వీరాజ్’ సినిమాతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పృథ్వీరాజ్’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే రాణి సంయోగితగా మానుషి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక చిల్లర్ నటిస్తున్న రెండో సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. రిలీజ్ కి రెడీగా ఉంది. 


 చిల్లర్ మూడో సినిమా అప్ డేట్ ఇటీవలే వచ్చింది. అరుణ్ గోపాలన్ దర్శకత్వంలో జాన్ అబ్రహం-మానుషి చిల్లర్ జంటగా ‘టెహ్రాన్’ తెరకెక్కుతోంది. ఇదో యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా సెట్స్ నుంచి రెండు ఫొటోలు షేర్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో మానుషి బేబీ కటింగ్, చేతిలో గన్ తో సరికొత్త లుక్ లో యాక్షన్ మూడ్ లో కనిపించింది. ఓ సినిమా పూర్తయిన టైమ్ లో మరో సినిమా ఆఫర్ రావడంతో చిల్లర్ హ్యీపీ మూడ్ లో కనిపిస్తుంది. ఈ ఆనందంలో కెమెరా ముందుకొచ్చి హాట్ హాట్ గా పోజులు కొడుతుంది. తాజాగా ఆరంజ్ డ్రెస్ లో నేలపై పడుకొని స్టిల్స్ ఇచ్చింది.