ప్రాజెక్ట్ K అవెంజర్స్ రేంజ్ సినిమా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే న్యూస్. ప్రస్తుతం ప్రభాస్ మూడు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సినిమాలు చేస్తున్నారు. అయితే ఏ ఒక్క సినిమా నుంచి అప్ డేట్స్ రాకపోవడం ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఓ అభిమాని అయితే.. ఈ వారంలోగా అప్ డేట్ ఇవ్వకుంటే సూసైడ్ చేసుకుంటానని సోషల్ మీడియా వేదికగా బెదిరించిన విషయం తెలిసిందే.

ఫ్యాన్స్ ఎంత డిమాండ్ చేసినా.. ఇప్పట్లో ప్రాజెక్ట్ కె అప్ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు అన్నట్టుగా దర్శకుడు నాగ్ అశ్విన్ క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే తాజాగా నిర్మాత అశ్వినీదత్ ప్రాజెక్ట్ వివరాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సీతా రామం’ ప్రమోషన్ లో పాల్గొన్న అశ్వినీ దత్ ప్రాజెక్ట్ కె అప్ డేట్స్ అందించారు.

“ఈ సినిమా అవెంజర్స్ రేంజ్ లో ఉంటుంది. చైనా, అమెరికా.. ఇంటర్నేషనల్ మార్కెట్ ను టార్గెట్ గా పెట్టుకుని తీస్తున్నాం. వచ్చే ఏడాది జనవరి కల్లా సినిమా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేశాం. ప్రీ ప్రొడక్షన్ కోసం దాదాపు 8 నెలల సమయం పడుతుంది. వచ్చే ఏడాది అక్టోబర్  లేదా 2024 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నాం. అమితాబ్ నటన నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.