దినేష్.. వెరీ వెరీ స్పెషల్ !

ఐపీఎల్ లో అదరగొట్టి.. అనూహ్యంగా టీమిండియా జట్టులో మళ్లీ చోటు సంపాదించుకున్నాడు దినేష్ కార్తీక్. బెస్ట్ ఫినిషర్ గా రాబోయే టీ20 వరల్డ్ కప్ లో తన స్థానం సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నాడు. ఇందుకోసం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. శుక్రవారం విండీస్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో తన మార్క్ చాటుకున్నాడు. 19 బంతుల్లో 41 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అందులో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి.

కెప్టెన్‌ రోహిత్ శర్మ (64), దినేశ్‌ కార్తిక్ (41*) ధాటిగా ఆడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ 190/6 స్కోరు చేసింది. అనంతరం టీమ్‌ఇండియా బౌలర్లు సమష్టిగా రాణించడంతో విండీస్‌ 122/8కే పరిమితమైంది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.