రెండూ.. బ్లాక్ బస్టర్ హిట్టే

ఈరోజు రెండు సినిమాలు బింబిసార, సీతారామం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం విశేషం. సినిమా చూసిన ప్రేక్షకులు సినిమాల టాక్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ  క్రమంలో హీరో అడవి శేష్ కూడా తన రివ్యూ ఇచ్చారు. రెండు సినిమాల గురించి బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వినడం ఆనందంగా ఉందన్నాడు. అయితే శేష్ సినిమాలు చూడాలేదు. ఆయనకు కరోనా సోకడంతో ఇంటికే పరిమితం అయ్యారు. సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్న టాక్ గురించి ట్వీట్ చేసారు.

‘కల్యాణ్‌రామ్‌ నటించిన ‘బింబిసార’, నా స్నేహితులు దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, సుమంత్‌ నటించిన ‘సీతారామం’ బాగున్నాయంటూ బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వినిపిస్తోంది. అసలు ఇది కదా కావాల్సింది..! కొవిడ్‌ వచ్చి ప్రస్తుతం నేను ఐసోలేషన్‌లో ఉన్నా. నాకోసం మార్నింగ్‌ షో ఒక సినిమా.. మ్యాట్నీలో మరో సినిమా కుమ్మేయండి’’ అని అడివి శేష్‌ పేర్కొన్నారు. ఇటీవల ‘మేజర్‌’తో మంచి విజయాన్ని అందుకున్న శేష్‌.. త్వరలోనే ‘హిట్‌-2’ సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు.