అప్పటి వరకు షూటింగ్స్ బంద్

  ఇటీవలే ప్రొడ్యూసర్ గిల్డ్ సినిమా షూటింగ్స్ బంద్ కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ కొందరు టాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాల షూటింగ్ లను నిర్వహిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ పుకార్లపై నిర్మాత దిల్ రాజు స్పందించారు.   

ప్రస్తుతం టాలీవుడ్ లో అన్ని సినిమాల షూటింగ్స్ నిలిచిపోయానని తెలిపారు. కొన్ని సినిమాల చిత్రీకరణలు కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఓటీటీ, థియేటర్ సమస్యలతో పాటు కార్మికుల వేతనాలు, వీపీఎఫ్ ఛార్జీల పరిష్కారానికై నాలుగు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యలన్నీ పరిష్కారం లభించిన తర్వాతే షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవుతాయని ఆయన అన్నారు.