తమిళ హీరోతో మలయాళ బ్యూటీ పెళ్లి

మలయాళ ముద్దుగుమ్మ మంజిమా మోహన్ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. నాగ చైతన్య ‘సాహసం సాగిపో శ్వాసగా’ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ : కథానాయకుడు, ఎన్టీఅర్ : మహానాయకుడు చిత్రాల్లో నారా భువనేశ్వరి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ‘అక్టోబర్ 31, లేడీస్ నైట్’ లో నటిస్తోంది. మధ్యలో పలు మలయాళ, తమిళ చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తిక్ తో ప్రేమలో పడింది.

తమ్ కార్తిక్, మంజిమా మోహన్ దాదాపు మూడేళ్లుగా ప్రేమలోఉన్నట్లు సమాచారం. 2019లో వీరిద్దరి కలయికలో దేవరాట్టం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా షూటింగ్ లో ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైనట్లు తెలిసింది. గత ఏడాది మంజిమా మోహన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా గౌతమ్ కార్తిక్ ఆమెను విష్ చేయడంతో వీరి లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఈ ప్రేమ బంధాన్ని పెళ్లి గా మార్చేందుకు గౌతమ్, మంజిమా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇరు కుటుంబ సభ్యుల వీరి ప్రేమకు అంగీకారం చెప్పినట్లు సమాచారం.