ఎన్టీఆర్-ప్రభాస్.. ఇద్దరూ హిట్టే !

ఈ శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర కళ్యాణ్ రామ్, దుల్కర్ సల్మాన్ పోటీ పడ్డారు. వీరిది చాలా ఫ్రెండ్లీ ఫైట్.  ‘బింబిసార’తో కళ్యాణ్ రామ్, ‘సీతారామం’తో దుల్కర్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటి నుంచి రెండు సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుతూ వచ్చారు. చివరికి అదే  జరిగింది. రెండు సినిమాలు బాగున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అంతేకాదు.. మంచి సినిమా వస్తే.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నిరూపించాయి. అయితే ఈ రెండు సినిమాల విజయం వెనక సూపర్ స్టార్స్ ఎన్ టీఆర్, ప్రభాస్ ల కష్టం కూడా ఉంది.

యంగ్ టైగర్ ఎన్ టీఆర్ బింబిసార ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన తారక్.. ఇప్పటికే తాను సినిమా చూశా. తనకు కథ ఎలా చెప్పారో.. సినిమా ఆ విధంగానే తీశారు. ఆల్రెడీ  కథ తెలిసినా తనకే సినిమా చూస్తుంటే థ్రిల్లింగ్ గా అనిపించింది. ఇక ఆడియన్స్ కచ్చింతంగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు. అంతేకాదు.. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ది బెస్ట్ సినిమా అవుతుందన్నారు. ఇప్పుడు తారక్ మాటలే నిజం అయ్యాయి.

మరోవైపు సీతారామం ప్రీ రిలీజ్ వేడుకకు ప్రభాస్ హాజరయ్యారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఓ అందమైన ప్రేమ కావ్యం ఇది అన్నారు. ఓటీటీ ఇంట్లో పూజ గది లాంటిది.. థియేటర్ దేవాలయం లాంటిది. ఇంట్లో పూజ గది ఉందని గుడి పోవడం మానేస్తామా ? ఇది కూడా అంతే. మంచి సినిమా వస్తే.. ఆటోమేటిక్ గా ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు. సినిమాను ఎంజాయ్ చేస్తారని చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతోంది. అందుకే తారక్, ప్రభాస్ ఇద్దరూ సూపర్  హిట్ అయ్యారని అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు.