బీజేపీలో చేరిన దాసోజు

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుంచి తెలంగాణ బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌ భాజపాలో చేరారు. ఢిల్లీ లో ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌, మాజీ ఎంపీ వివేక్‌, సీనియర్‌ నేత మురళీధర్‌రావు తదితర నేతలు పాల్గొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, రేవంత్ రెడ్డి పార్టీని నాశనం చేస్తున్నాడని ఆరోపిస్తూ.. దాసోజు శ్రవణ్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో ఆయన సమావేశం అయ్యారు. అప్పుడే బీజేపీలో చేరారు. అయితే ఆయన మళ్లీ ఢిల్లీ వెళ్లి.. అక్కడ కూడా పార్టీలో చేరే కార్యక్రమాన్ని నిర్వహించారు.