బీజేపీలో చేరబోతున్న జయసుధ.. ముహూర్తం ఖరారు ?

తెలంగాణ బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రముఖ సినీనటి జయసుధ కమలం తీర్థం పుచ్చుకునేందుకు అంగీరించనట్టు సమాచారం. గతంలో కాంగ్రెస్‌లో కొనసాగిన జయసుధ.. 2009లో సికింద్రాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల  పార్టీలో చేరిక అంశంపై తెలంగాణ భాజపాకు చెందిన కొంతమంది నేతలు జయసుధతో చర్చలు జరిపారని తెలిసింది.

ఈనెల 21న మునుగోడులో జరిగే సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో జయసుధ బీజేపీలో  చేరుతారంటూ వార్తలు వచ్చాయి. బీజేపీ పెద్దల ముందు ఆమె కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది. వాటికి అంగీకరిస్తేనే కమల తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.