ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో రాజమౌళి

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (టిఫ్‌ – 2022)లో రాజమౌళి పాల్గొనౌన్నారు. హాలీవుడ్‌ ప్రముఖులతో కలిసి చర్చావేదికలో పాల్గొననున్నారు. ఆ విషయాన్ని టిఫ్‌ అధికారికంగా ప్రకటించింది.

47వ టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సెప్టెంబర్‌ 8 నుంచి 18 వరకు జరగనుంది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించారు రాజమౌళి. రోసో బ్రదర్స్ తో పాటు పలువురు హాలీవుడ్ ప్రముఖులు రాజమౌళి పనితనంపై ప్రశంశలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇక జక్కన్న తదుపరి సినిమా మహేష్‌బాబుతో ఉండనుంది. ప్రిన్స్ కోసం జేమ్స్ బాండ్ కథను రెడీ చేస్తున్నారట జక్కన్న.