#Suriya42 కోసం దేవి, పటానీ

సినిమాటోగ్రాఫర్ శివ డైరెక్టర్ గా మారి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ ‘శౌర్యం’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘శంఖం’తో గోపీచంద్ కు మరో హిట్ ఇచ్చాడు. ఇక వీరమ్ తర్వాత కోలీవుడ్ స్టార్ అజిత్ తో మరో మూడు సినిమాలు వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలు చేశారు. అన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంతో అన్నాత్తె చేశారు. ఇప్పుడు సూర్య హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు.

Suriya42 గా తెరకెక్కనున్న ఈ సినిమా అప్ డేట్ వచ్చింది. ఈ నెల 21న పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ తో కలిసి గ్రీన్ స్టూడియోస్ నిర్మించనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే నటించనున్నారని తెలిసింది. మొదట్లో అనిరుధ్ సంగీతం అందించబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ ఆయన స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకున్నారు. సూర్య నటించిన సింగం సిరీస్ కు దేవిశ్రీ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.