లైగర్ OTT రిలీజ్.. రూ. 200 కోట్ల ఆఫర్

పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడు పెంచిన లైగర్ టీమ్ వరుసగా ఇంటర్వ్యూ ఇస్తుంది. ఈ క్రమంలో పూరి, విజయ్, ఛార్మి కలిసి ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. లైగర్ 2 కూడా ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. లైగర్ 2 చేయమని కోరిన తొలి వ్యక్తి కరణ్ జోహార్ అని పూరి తెలిపారు. 

ఇక లైగర్ గురించి ఛార్మి మాట్లాడుతూ.. 2019 ఆగస్టు నెలలోనే నేనూ పూరిగారు మిమ్మల్ని కలిసి కథ చెప్పాం. ఆ తర్వాత కొవిడ్‌ వచ్చింది. వరుస లాక్‌డౌన్‌లు వచ్చాయి. ఈ కష్టసమయంలోనూ ఆర్థికంగా చాలా ఛాలెంజెస్‌ వచ్చాయి. ఓటీటీకి అమ్మడానికి భారీ ఆఫర్‌ వచ్చింది. జేబులో ఒక్క రూపాయి లేదు. అంత భారీ ఆఫర్‌ రిజెక్ట్‌ చేయడానికి దమ్ము కావాలి. ఆ దమ్మున్న వ్యక్తి పూరిగారు. ఇది థియేటర్‌ ఫిల్మ్‌. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాం అని చెప్పుకొచ్చారు.