చిరు, రాజమౌళికి మణిరత్నం కృతజ్ఞతలు

మెగాస్టార్ చిరజీవి, దర్శకధీరుడు రాజమౌళికి ప్రముఖ దర్శకుడు మణిరత్నం కృతజ్జతలు చెప్పారు. ఆయన దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఎపిక్‌ పిరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ గా ‘పొన్నియిన్‌’ తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబర్ 30న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ‘చోళ చోళ’ సాంగ్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిరంజీవి రాజమౌళికి కృతజ్జతలు చెప్పారు. చిరుకు థ్యాంక్స్  ఎందుకో తర్వాత చెబుతా. ఇక చోళ సామ్రాజ్యం గురించి చెప్పే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లాంటి భారీ చిత్రాన్ని అదీ రెండు భాగాలుగా  తీయడానికి మాకు బాటలుపరిచిన రాజమౌళి గారికి కృతజ్ఞతలు. అందుకు కారణం ‘బాహుబలి’ సినిమానే అన్నారు. ఇక చియాన్ విక్రమ్ మాట్లాడుతూ.. మణిరత్నం, శంకర్ సినిమాల్లో నటిస్తే.. రిటైర్ అయిపోవచ్చు అన్నారు. 

#PS1 is possible today because of #Baahubali ❤️🔥 – Mani Ratnam pic.twitter.com/m1DZ2CRmAN— ` (@charanvicky_) August 19, 2022