మల్లారెడ్డి.. ది పొలిటికల్ ఎంటర్టైనర్ !

మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ ఉప ఎన్నికలో గెలిచిన ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికలకు పోవాలని ప్రధాన పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ లు భావిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అమలు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ తో పాటు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇతర నేతలు సీరియస్ మూడ్ లో కనిపిస్తున్నారు. అయితే మంత్రి మల్లారెడ్డి మాత్రం చిల్ మూడ్ లో కనిపించి ఆకట్టుకున్నారు.

మునుగోడు సభకు వచ్చే క్రమంలో ఆయన తీన్మార్ డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి నడుచుకుంటూ ఓ సారి.. కారు ఎక్కి మరోసారి చిందులు వేశారు. మల్లారెడ్డి మస్త్ గా వేసిన డ్యాన్సులు అక్కడి వారిని ఆకట్టుకోవడమే కాదు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వార్నీ.. సమయం, సందర్భం ఏమీ లేదు.. మంత్రికి మూడొస్తే అంతేనని నెటిజన్లు సటైర్స్ వేస్తున్నారు.  
ఇక మునుగోడులో ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్ మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. బీజేపీ వస్తే.. రైతుల బతుకులు ఆగమైనట్టే. మోటరు వద్ద మీటర్లు పెడతరు. సంక్షేమ పథకాలు ఎత్తేస్తరని చెప్పుకొచ్చిండు. కృష్ణా లో తమ వాటా ఎంత ? తేల్చాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. రేపటి సభలో తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి అమిత్ షా ను డిమాండ్ చేశారు. 

స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసిన మంత్రి మ‌ల్లారెడ్డి! sir

@chmallareddytrs #MallaReddy #TRSParty #Munugodu #MunugoduWithTRS #Munugoduwithkcr #NTVTelugu pic.twitter.com/T2MmqyGsrj— Prashanth (@Prashu73368868) August 20, 2022

Minister Malla Reddy shaking his leg #CMKCR #Munugodu pic.twitter.com/0VtJ8ITDOD— Saritha Avula (@SarithaAvula) August 20, 2022