రౌడీ హీరో ‘మెంటల్’ కామెంట్స్

డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్. ఈ వారమే (ఆగస్టు 25) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. “నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీ ‘లైగర్‌’. నా సినిమా మీద నాకు నమ్మకం వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎంజాయ్‌ చేయాలనిపించింది. సరైన సమయంలో లైఫ్‌ డ్రామా మొదలైంది. వరుస షెడ్యూల్స్‌ కారణంగా ఆరోగ్యం సహకరించలేదు. ఈ రోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే మీరు ఇచ్చిన ప్రేమే కారణం. ఇక్కడే కాదు, ఇండియాలో ఏ ఊరుకు వెళ్లినా ప్రేమించారు. 

యాక్టింగ్‌ ఆపేసి, 60ఏళ్లు వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొంటే ఈ 20 రోజుల్లో జరిగిన ఈవెంట్స్‌, మీ ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేను.మీరంతా ఎన్నో  మధుర జ్ఞాపకాలు ఇచ్చారు. ఈ కథ విన్నప్పుడు నేను ఏం చెబుతానా? అని పూరి, ఛార్మి నావైపు చూశారు. నా నోటి నుంచి వచ్చిన ఒకే ఒక మాట ‘మెంటల్‌’. ఈ సినిమాను త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నా. కానీ, మూడేళ్లు పట్టింది. షూటింగ్‌ చేసే సమయంలో ప్రతి సీన్‌ చేస్తున్నప్పుడు వాటిని చూస్తే నా నోటి నుంచి వచ్చిన మాట ‘మెంటల్’. ఈ సినిమా ఘన విజయం సాధించటం ఖాయం’’ అన్నారు.