ఘనంగా ‘పుష్ప 2’ పూజా కార్యక్రమాలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ ఉదయం పుష్ప 2 పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి సుకుమార్, రష్మిక మందన, మైత్రీ మూవీస్ నిర్మాతలు హాజరయ్యారు. బన్నీ ఫ్యామిలీతో కలిసి న్యూ యార్క్ లో పర్యటిస్తున్నారు. దీంతో పుష్ప 2 పూజా కార్యక్రమాలకు ఆయన హాజరు కాలేదు.

ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాతల బంద్  కొనసాగుతోంది. బంద్ ను ఎత్తేయగానే పుష్ప 2 ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. సుకుమార్-బన్నీ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. బ్లాక్ బస్టర్  హిట్ అయింది. పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. ఇప్పుడు పుష్ప 2 కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి. ఇప్పటికే రెండు, మూడు పాటలను దేవిశ్రీ ప్రసాద్ పూర్తి చేశారు. పుష్ప అంతకుమించి పుష్ప 2 ఉండేలా సుకుమార్ ప్లాన్ చేసినట్టు తెలిసింది.