ఫీనిక్స్‌ కంపెనీపై ఐటీ.. ! టీఆర్ఎస్ రెక్కలు విరుస్తున్న బీజేపీ ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జైలు పోవడం ఖాయం. త్వరలోనే ఆయన, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ దాడులు జరుగుతున్నాయని ప్రచారం చేశారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఫీనిక్స్‌ కంపెనీపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు.నగరంలో 20 చోట్లకు పైగా ఐటీ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. నానక్‌రాంగూడ, గోల్ఫ్‌ఎడ్జ్‌ ఆఫీసుల్లో తదితర ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

ఫీనిక్స్‌ సంస్థ హైదరాబాద్‌ కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. ఫీనిక్స్‌ సంస్థలో పలువురు రాజకీయ ప్రముఖులు పెట్టుబడులు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. వీరిలో అత్యధికులు టీఆర్ఎస్ కు చెందిన వారు. కేసీఆర్ కుటుంబానికి సన్నిహితులు అని సమచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను టచ్ చేయకుండా ఆయన రెక్కలు విరిచే పని బీజేపీ పెట్టుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.