బిహార్‌ సైనికుల కుటుంబాలకు తెలంగాణ చెక్కులు

ప్రతి ఒక్క భారతీయుడు.. సైనికులకు అండగా ఉంటాడు అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బిహార్‌ పర్యటనలో భాగంగా పట్నా చేరుకున్న కేసీఆర్.. గల్వాన్‌ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బిహార్‌ సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘బిహార్‌లో చేపట్టే మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. దేశం కోసం అమర జవాన్లు ప్రాణాలు అర్పించారు. వారి త్యాగం వెలకట్టలేనిది. ప్రతి ఒక్క భారతీయుడు.. సైనికులకు అండగా ఉంటాడు. కరోనా సమయంలో వలస కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు. స్వగ్రామానికి చేర్చడానికి కార్మికుల కోసం రైళ్లను ఏర్పాటు చేశాం. తెలంగాణ అభివృద్ధిలో బిహార్‌ వలస కార్మికులు భాగస్వాములయ్యారు. అలాంటి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.