హ్యాపీ 16 మై యంగ్‌ మ్యాన్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు  తనయుడు గౌతమ్‌ బర్త్‌ డే ఈరోజు. ఈ  సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్ చేసిన పోస్ట్ వైరల్‌ అవుతోంది. “హ్యాపీ 16 మై యంగ్‌ మ్యాన్‌!! ప్రతి రోజూ నువ్వు నన్ను గర్వపడేలా చేస్తావు. నువ్వో బెస్ట్‌ పర్సన్‌గా ఎదుగుతూ ఉంటే చూడటానికి ఆతృతగా ఉన్నాను. ఈ కొత్త దశ నుంచి నువ్వు చేస్తున్న ఈ ప్రయాణంలో నా ప్రేమ, ఆశీర్వాదం నీకుంటాయి. ఒక్కటి గుర్తుంచుకో.. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాను! లవ్‌ యూ మై సన్‌.. నువ్వ అనుకున్నదాని కంటే ఎక్కువగానే ప్రేమిస్తున్నా”ను అంటూ రాసుకొచ్చాడు.

మహేష్ తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 8 నుంచి రెగ్యులర్ షూట్ షురూ కానుంది. ఈ సినిమాలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే కనిపించనుంది. అతడు రిమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా కోసం అర్జునుడు, పార్థు అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. ఆ వెంటనే రాజమౌళి డైరెక్షన్‌లో మూవీని మహేష్‌ మొదలుపెట్టబోతున్నాడు.