మహేష్-త్రివిక్రమ్.. ఓపెన్ ఫైట్

త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 8 నుంచి రెగ్యులర్ షూట్ షురూ కానుంది. ఇప్పుడీ.. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమా కోసం ఓ ఓపెన్ ఫైట్ ను ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. ఖలేజా సినిమా ఆరంభంలో ఓ ఫైట్ వుంటుంది. అరవింద సమేత సినిమాలో ఓ ఫైట్ చిత్రీకరించారు. మంది లేరా..కత్తుల్లేవా అంటూ ఎన్టీఆర్ ఘర్జించే ఫైట్ అది. ఇప్పుడు ఈ రెండూ కలబోసిన రేంజ్ అన్నట్లుగా ఓ ఫైట్ డిజైన్ చేస్తున్నారట.

ఈ చిత్రంలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. మహర్షి తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ విడుదల టార్గెట్ గా ఈ సినిమాను ప్రారంభిస్తున్నారు. ఆ టైమ్ కు రెడీ అవుతుందా లేదా అన్నది కొంత వర్క్ అయితే తప్ప క్లారిటీ రాదు. ఎందుకంటే దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు వుంటాయి ఇండస్ట్రీలో కూడా. అవన్నీ తీసేస్తే ఆరు నెలల్లో ఇంత భారీ సినిమా తయారు కావడం అంటే కాస్త ఆలోచించాల్సిందే.